మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని ఎస్సారెస్పీ డీబీఎం-60 ప్రధాన కాలువను ఎమ్మెల్యే రెడ్యానాయక్ పరిశీలించారు. గేట్లు ఎత్తి దిగువకు గోదావరి నీటిని విడుదల చేశారు. అనంతరం పెద్దముప్పారంలో రూ.2.50 కోట్లతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను ఆయన ప్రారంభించారు. మరో 50 ఇళ్ల నిర్మాణాలతోపాటు సిమెంటు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాలువ ఆయకట్టు పరిధిలోని సాగు భూములను శ్యామలం చేయడమే ధ్యేయంగా పని చేస్తానన్నారు.
"భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం"
డోర్నకల్ నియోజకవర్గంలోని భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమంని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు.
గోదావరి జలాలకు పూజలు చేసిన ఎమ్మెల్యే