తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల జోలికొస్తే ఎవరయినా సరే ఊరుకునేది లేదు: శంకర్​నాయక్​ - Mahabubabad district latest news

రైతుల సంక్షేమం కోసమే తెరాస ప్రభుత్వం ఉందని... ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ అన్నారు. వారి జోలికి ఎవరు పోయినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. లైన్ తండాలో జరిగిన పోడు భూముల ఘర్షణ విషయంలో అటవీశాఖ అధికారులపై నిప్పులు చెరిగారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో రైతు వేదికలను ఆయన ప్రారంభించారు.

MLA Shankar Nayak started rythu vedika in Gudur zone of Mahabubabad district
రైతుల జోలికొస్తే ఎవరయినా సరే ఊరుకునేది లేదు: శంకర్​నాయక్​

By

Published : Feb 10, 2021, 11:05 PM IST

పొడు భూముల్లో ట్రెంచ్​లు కొడితే తనకు సమాచారం అందించాలని, ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటానని... ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని గుండెంగ, పోనుగోడు, భూపతి పేట గ్రామాల్లో రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. లైన్ తండాలో జరిగిన పోడు భూముల ఘర్షణపై అటవీశాఖ అధికారులపై నిప్పులు చెరిగారు. రైతుల సంక్షేమం కోసమే తెరాస ప్రభుత్వం ఉందని అన్నారు. వారి జోలికి ఎవరు పోయినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

'ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అటవీశాఖ అధికారులతో మాట్లాడారు. యథాతథ స్థితిని మెయింటెయిన్ చేయాల్సిందిగా అధికారులు ఆదేశించారు. దయచేసి అటవీశాఖ అధికారులు రైతులను రెచ్చగొట్టవద్దు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే హరితహారం పేరుతో కోట్ల మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడుకుంటున్నాం.'

----- ఎమ్మెల్యే శంకర్​ నాయక్​

ఇదీ చదవండి: ఫార్మసీవిద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details