తెలంగాణ

telangana

ETV Bharat / state

పుట్టినరోజు సందర్భంగా రూ.5లక్షలు విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే

మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. కొవిడ్​ బాధితులకు అత్యవసర వైద్య పరికరాలు సమకూర్చాలని కోరుతూ తన పుట్టిన రోజు సందర్భంగా రూ. 5 లక్షలు విలువైన చెక్కును కలెక్టర్​కు అందజేశారు.

By

Published : May 21, 2021, 12:07 PM IST

Telangana news
మహబూబాబాద్​ వార్తలు

మహబూబాబాద్​ ఎమ్మెల్యే బానోత్​ శంకర్​ నాయక్​ తన ఉదారతను చాటుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా కొవిడ్​ బాధితుల అత్యవసర చికిత్సకు అవసరమైన సామగ్రి సమకూర్చాల్సిందిగా రూ.5 లక్షలు చెక్కును జిల్లా కలెక్టర్​కు అందించారు.

అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్​ అందించారు. మున్సిపల్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కొవిడ్​ బాధితులకు ఆక్సిజన్​ సమకూర్చడం కోసం తన జీతం నుంచి రూ. 5 లక్షలు అందించానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్​ రామ్మోహన్ రెడ్డి, తెరాసా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:రాష్ట్ర సంస్కృతి ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శం: సీఎం

ABOUT THE AUTHOR

...view details