మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తన ఉదారతను చాటుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా కొవిడ్ బాధితుల అత్యవసర చికిత్సకు అవసరమైన సామగ్రి సమకూర్చాల్సిందిగా రూ.5 లక్షలు చెక్కును జిల్లా కలెక్టర్కు అందించారు.
పుట్టినరోజు సందర్భంగా రూ.5లక్షలు విరాళం ఇచ్చిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తన జన్మదిన వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. కొవిడ్ బాధితులకు అత్యవసర వైద్య పరికరాలు సమకూర్చాలని కోరుతూ తన పుట్టిన రోజు సందర్భంగా రూ. 5 లక్షలు విలువైన చెక్కును కలెక్టర్కు అందజేశారు.
మహబూబాబాద్ వార్తలు
అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ అందించారు. మున్సిపల్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా కొవిడ్ బాధితులకు ఆక్సిజన్ సమకూర్చడం కోసం తన జీతం నుంచి రూ. 5 లక్షలు అందించానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, తెరాసా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్ర సంస్కృతి ప్రపంచ సాంస్కృతిక జీవన విధానానికి ఆదర్శం: సీఎం