తెలంగాణ

telangana

By

Published : Jun 3, 2021, 10:30 AM IST

ETV Bharat / state

బాల్యవివాహంపై ఫిర్యాదు చేసింది.. మంత్రితో సన్మానం పొందింది

బాల్య వివాహం ఇష్టం లేదని, చదువుకోవాలని ఉందని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన బాలికను మంత్రి సత్యవతి రాఠోడ్​ సన్మానించారు. బాలిక ఉన్నత చదువులు చదవుకోడానికి అన్ని విధాల సాయపడతామని మంత్రి హామీ ఇచ్చారు.

Telangana news
మహబూబాబాద్​ వార్తలు

తల్లిదండ్రులు తనకు ఇష్టంలేకుండా పెళ్లి చేస్తున్నారని ఇంటర్​ విద్యార్థిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన అధికారులు గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాఠోడ్​ బాలికను సన్మానించారు.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం, మన్నెగూడెంకు చెందిన బాలిక ఇంటర్ మొదటి సంవత్సరం చదివింది. ఈ వేసవిలో ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. తనకీ పెళ్లి ఇష్టంలేదు.. చదువుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు వినిపించుకోకపోవడం వల్ల మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులకు ఫోన్​చేసి ఫిర్యాదు చేసింది.

స్పందించిన అధికారులు గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేసిన బాలికను పలువురు అభినందించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి సత్యవతి రాఠోడ్​ విద్యార్థినిని సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్​ బిందు, ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ ఛైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:Vaccine : వ్యాక్సిన్​తోనే రక్ష.. నిరూపించిన నిజామాబాద్ జీజీహెచ్

ABOUT THE AUTHOR

...view details