తెలంగాణ

telangana

ETV Bharat / state

'వేసవిలో ప్రతి ఇంటికి తాగు నీరు అందించాలి'

వేసవిలో ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని మంత్రి సత్యవతి రాఠోడ్ అధికారులను ఆదేశించారు. తాగునీరు, రైతుబంధు, ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

By

Published : May 12, 2020, 11:14 AM IST

minister-satyavathi-rathod-review-meeting
'వేసవిలో ప్రతి ఇంటికి తాగు నీరు అందించాలి'

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తాగునీరు, రైతుబంధు, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై అధికారులతో మంత్రి సత్యవతి రాఠోడ్ సమీక్ష నిర్వహించారు.

"గ్రామాలలో నీటి ఎద్దడిపై గల కారణాలను అధికారులు గుర్తించండి. వేసవిలో ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చూడాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల వివరాలు సేకరించి రైతుబంధును అందజేస్తాం. బ్యాంకు నుంచి 25 వేల లోపు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేసేందుకు నివేదికలు తయారు చేయమని అధికారులకు సూచించాం. ధాన్యం కొనుగోలుపై గురించి వ్యవసాయ మంత్రితో చర్చిస్తాం. దిగుబడులు పెరిగినందున... మక్కల తరలింపునకు గోదాంల కొరత, హమాలీల కొరతను మంత్రి శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకుపోతాం."

-మంత్రి సత్యవతి రాఠోడ్

'వేసవిలో ప్రతి ఇంటికి తాగు నీరు అందించాలి'

ఇవీ చూడండి:లండన్ నుంచి శంషాబాద్ చేరుకున్న 69 మంది భారతీయులు

ABOUT THE AUTHOR

...view details