తెలంగాణ

telangana

ETV Bharat / state

'అణగారిన వర్గాల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తాను'

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ చేసిన కృషి తరతరాలకు గుర్తుండిపోతుందని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. అంబేడ్కర్​ 130వ జయంతి సందర్భంగా ఆమె నివాళులు అర్పించారు.

By

Published : Apr 14, 2021, 1:17 PM IST

minister satyavathi rathod pays tribute to ambedkar at mahabubabad
'అణగారిన వర్గాల సంక్షేమానికి నా వంతు కృషి చేస్తాను'

రాజ్యాంగ నిర్మాత, డాక్టర్​ బాబాసాహెబ్ అంబేడ్కర్​ 130వ జయంతి సందర్భంగా మహబూబాబాద్​లో వేడుకలు నిర్వహించారు. మంత్రి సత్యవతి రాఠోడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆ కాలంలోనే ఎవరూ చదవనన్నీ డిగ్రీలు చదివి, భారత రాజ్యాంగాన్ని రచించిన మహాగొప్ప వ్యక్తి అంబేడ్కర్​ అని మంత్రి వ్యాఖ్యానించారు. పేద, బడుగు, వెనకబడిన వర్గాలు సమాజంలో నిలబడాలని విద్య ఒక్కటే మార్గమని చాటి చెప్పిన వ్యక్తి అని తెలిపారు.

వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి వెల్లడించారు. ఈ ఏడు సంవత్సరాల్లో విద్యాసంస్థలను 200 శాతం రెట్టింపు చేశామని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లేందుకు 20 లక్షల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. నేను కూడా వెనుకబడిన వర్గం నుంచే వచ్చానని... అణగారిన వర్గాల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చూడండి:బాబాసాహెబ్​కు మోదీ, రాహుల్ నివాళి

ABOUT THE AUTHOR

...view details