కొవిడ్ రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. కొవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి కలెక్టర్లతో మంత్రి సత్యవతి రాఠోడ్ ఫోన్లో మాట్లాడారు.
కట్టడి చర్యలు కఠినంగా అమలు చేయండి: సత్యవతి రాఠోడ్ - తెలంగాణ కరోనా వార్తలు
కొవిడ్ నివారణ చర్యలు మరింత కఠినంగా అమలు చేయాలని మంత్రి సత్యవతి రాఠోడ్ సూచించారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి కలెక్టర్లతో మంత్రి సత్యవతి రాఠోడ్ ఫోన్లో మాట్లాడారు.
![కట్టడి చర్యలు కఠినంగా అమలు చేయండి: సత్యవతి రాఠోడ్ తెలంగాణ వార్తలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11:51:07:1619418067-noname-2604newsroom-1619414786-703.jpg)
జిల్లా కలెక్టర్లకు ఫోన్ చేసిన మంత్రి సత్యవతి రాఠోడ్
అత్యవసర మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. వ్యాక్సినేషన్లో సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని... కరోనా కట్టడి, జాగ్రత్తలు, చికిత్సపై అవగాహన కల్పించాలని కలెక్టర్లకు మంత్రి సత్యవతి రాఠోడ్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి:కాసుపత్రులు: ప్రైవేటు ల్యాబ్లో వసూళ్లపై అడిగేవారేరి?