తెలంగాణ

telangana

By

Published : May 9, 2020, 12:50 PM IST

ETV Bharat / state

నిరుపేదలకు నిత్యావసర సరకుల అందజేత

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో లాక్​డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేద ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యావసర సరుకులను అందజేశారు.

minister errabelli distributed daily commodities
నిరుపేదలకు నిత్యావసర సరకుల అందజేత

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులోని నిరుపేదలకు మంత్రి ఎర్రబెల్లి నిత్యావసర సరుకులు అందజేశారు.

ఐరన్ అశోక్ రెడ్డి సహకారంతో దాదాపు 200 మంది నిరుపేదలకు బియ్యం, పప్పు, నూనెలను పంపిణీ చేశారు. లాక్​డౌన్ పూర్తయ్యేవరకూ ప్రజలెవరూ ఇళ్లలోంచి బయటకు రాకూడదని సూచించారు.

ఇవీ చూడండి:ధాన్యం సేకరణలో అగ్రస్థానంలో తెలంగాణ: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details