తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు తాజా వార్తలు

మహబూబాబాద్ జిల్లా​లో హత్యకు గురైన దీక్షిత్​రెడ్డి(9) కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు. ​దీక్షిత్​ చిత్రపటంపై పూలు చల్లి నివాళులర్పించి బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

minister errabelli condolences to deekshith reddy family
సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి

By

Published : Oct 26, 2020, 6:10 PM IST

సీఎం కేసీఆర్​, పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీక్షిత్ రెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో కిడ్నాప్​తో పాటు హత్యకు గురైన దీక్షిత్ చిత్రపటంపై ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్​లతో కలిసి ఎర్రబెల్లి.. పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

దీక్షిత్​ కుటుంబానికి చాలా అన్యాయం జరిగిందని, కిడ్నాపర్​ తెలిసిన వ్యక్తి కాబట్టే అతను పిలిస్తే వెళ్లాడని మంత్రి పేర్కొన్నారు. ఈ కేసుని పోలీసులు చాలా చురుగ్గా డీల్ చేశారని అన్నారు. అన్నీ చట్ట ప్రకారం చేశామని, ప్రజల్లో వేరే విధమైన అనుమానాలున్నాయని వెల్లడించారు.

నిందితుడిని కఠినంగా శిక్షించి, మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుకుంటున్నారని మంత్రి అన్నారు. న్యాయం చేస్తామని, అందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు.

సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తాం: మంత్రి ఎర్రబెల్లి

ఇదీ చదవండి:తెలంగాణ-ఏపీ మధ్య అంతర్రాష్ట సేవలు ఇకనైనా ప్రారంభమయ్యేనా?

ABOUT THE AUTHOR

...view details