తెలంగాణ

telangana

ETV Bharat / state

నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేసిన జడ్పీ ఛైర్​పర్సన్​

మహబూబాబాద్​ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో నిరుపేద కుటుంబాలకు 5 రకాల కూరగాయలను జడ్పీ ఛైర్​పర్సన్​ ఆంగోత్​ బిందు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు.

By

Published : May 15, 2020, 11:23 PM IST

mahabubabad zp chairperson vegetables distribution
నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేసిన జడ్పీ ఛైర్​పర్సన్​

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని 200 మంది నిరుపేద కుటుంబాలకు ఎంపీటీసీ తమ్మిశెట్టి కుమారి ఆధ్వర్యంలో 5 రకాల కూరగాయలను జడ్పీ ఛైర్ పర్సన్ ఆంగోత్ బిందు, తెరాస నాయకులు ఇంటింటికి తిరుగుతూ పంపిణీ చేశారు. మండలంలో గత 3 రోజులుగా పంపిణీ చేస్తున్నామని జడ్పీ ఛైర్​ పర్సన్​ బిందు తెలిపారు.

ఈ విపత్కర సమయంలో సహాయ కార్యక్రమాలు చేస్తున్న ఎంపీటీసీ కుమారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇవీ చూడండి: మానవత్వం చాటుకున్న జడ్పీటీసీ... గర్భిణి వలసకూలీకి సాయం

ABOUT THE AUTHOR

...view details