తెలంగాణ

telangana

నిల్వ చేసిన గుట్కా స్వాధీనం.. ఒకరు అరెస్ట్, ముగ్గురు పరారీ!

అక్రమంగా నిల్వ చేసిన లక్ష  రూపాయల విలువ చేసే మూడు బస్తాల నిషేధిత గుట్కాను మహబూబాబాద్​ రూరల్​ పోలీసులు పట్టుకున్నారు. గుట్కా నిల్వ చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని సీఐ వెంకటరత్నం తెలిపారు.

By

Published : Jul 7, 2020, 7:59 AM IST

Published : Jul 7, 2020, 7:59 AM IST

Mahabubabad Police Attacks on Banned Gutkha
అక్రమ గుట్కా స్వాధీనం.. ఒకరు అరెస్ట్.. ముగ్గురు పరారీ!

మహబూబాబాద్​ జిల్లా కంబాలపల్లి గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన లక్ష రూపాయల విలువ చేసే మూడు బస్తాల అంబర్​, సగం బస్తా గుట్కా ప్యాకెట్లను మహబూబాబాద్​ రూరల్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఒకరిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. కంబాలపల్లి గ్రామానికి చెందిన గుండ్ల శ్రీను, శంకర్​, ఉపేందర్​, నర్సయ్య అనే నలుగురు వ్యక్తులు కారులో బీదర్, హైదరాబాద్​ నుంచి గుట్కా, అంబర్​ ప్యాకెట్లను తీసుకొచ్చి మహబూబాబాద్​ పట్టణంతో పాటు.. చుట్టు పక్కల గ్రామాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి నిందితులను పట్టుకున్నామని, పరారీలు ఉన్న ముగ్గురు వ్యక్తులను కూడా పట్టుకుంటామని సీఐ వెంకటరత్నం తెలిపారు. అక్రమ వ్యాపారాలు, స్మగ్లింగ్​ చేసేవారు మానుకోవాలని.. లేకపోతే.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

ఇదీ చూడండి:చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details