మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ ఉమ సూచించారు. దళారులను నమ్మి మోసపోకుండా.. కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని వివరించారు. కురవి మండలం నేరడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.
‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి’ - వ్యవసాయ మార్కెట్ కమిటీ
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ ఉమ పర్యటించారు. నేరడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

kuravi grain purchasing center
కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. కేంద్రాల్లో మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని ఉమ, రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మావతితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'కరోనా నియంత్రణ కంటే ఎన్నికలే ముఖ్యమా..?'