మహబూబాబాద్ జిల్లా కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్ర స్వామి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా స్వామి వారు, అమ్మవారికి గ్రామస్థులు సంప్రదాయంగా ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం చేపట్టిన కల్యాణోత్సవానికి మహబూబాబాద్ డీఎస్పీ నరేష్, ఆర్డీఓ కొమురయ్య స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వీరభద్ర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే - mahabubabad district latest news today
కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్ర స్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆ వేడుకలకు రాష్ట్ర గిరిజన మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
![వీరభద్ర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే kuravi veerabhadra Swamy Kalyanotsavam Minister satyavathi rathod, mla attend](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6161252-514-6161252-1582338774216.jpg)
వీరభద్ర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే
వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా సాగింది. భద్రకాళీ వీరభద్రస్వామి కల్యాణోత్సవాన్ని భక్త్తులు ఆసక్తితో తిలకించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర గిరిజన మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్తోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వీరభద్ర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే
ఇదీ చూడండి :వేగం పెరగదు.. ముందుకు సాగదు..!