తెలంగాణ

telangana

పంచాయతీ నిధుల దుర్వినియోగం.. సర్పంచ్​ సస్పెన్షన్!

గ్రామ పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసిన కారణంగా జిల్లా కలెక్టర్ గ్రామ సర్పంచ్​ను ​సస్పెం​డ్​ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలో చోటు చేసుకుంది. సర్పంచ్​ బాధ్యతల నుంచి సస్పెండ్​ చేయడం జిల్లాలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం.

By

Published : Jul 28, 2020, 8:11 AM IST

Published : Jul 28, 2020, 8:11 AM IST

Breaking News

గ్రామ పంచాయతీ అభివృద్ధికై కేటాయించిన నిధులను దుర్వినియోగం పరచడం నేరమని, గ్రామాభివృద్ధికి తద్వారా దేశాభివృద్ధికి అది ఆటంకమని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్​ అన్నారు. జిల్లా పరిధిలోని గూడూరు మండలం గుండెంగ గ్రామ సర్పంచ్​ను గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో విధుల నుంచి సస్పెండ్​ చేశారు.

తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 37(11) క్రింద సర్పంచ్​పై వచ్చిన ఆరోపణల మేరకు కలెక్టర్​ సమగ్ర విచారణ జరిపించారు. విచారణ అనంతరం తేలిన వాస్తవాల ఆధారంగా గుండెంగ గ్రామ సర్పంచ్ భూక్యా రవిసింగ్​ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పై పంచాయతీ సర్పంచ్​గా పూర్తి బాధ్యతలను ఉప సర్పంచ్ కందిక స్వామికి ఇస్తూ సర్పంచ్​ విధులను సక్రమంగా కొనసాగించాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, అక్రమాలు, అవినీతికి పాల్పడితే సహించేది లేదని కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు. కాగా.. మహబూబాబాద్​ జిల్లాలో ఇదే తొలి సస్పెన్షన్​ కావడం గమనార్హం.

ఇదీ చదవండి :'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ABOUT THE AUTHOR

...view details