మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్కు చెందిన మల్సూర్ విద్యుదాఘాతంతో మరణించగా... జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అతని కుటుంబాన్ని పరామర్శించారు. మేయర్ రామ్మోహన్ మహబూబాబాద్ చేరుకొని... స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి మల్సూర్ వెళ్లారు. బాల్య స్నేహితుడి మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అతని అంత్యక్రియలలో పాల్గొన్నారు.
మిత్రుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ పరామర్శ - జీహెచ్ఎంసీ మేయర్ పరామర్శ
విద్యుదాఘాతంతో మృతి చెందిన తన మిత్రుడి కుటుంబాన్ని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరామర్శించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్నగర్కు చెందిన మల్సూర్ విద్యుదాఘాతంతో మరణించాడు. మేయర్ రామ్మోహన్ మహబూబాబాద్ చేరుకుని మల్సూర్కు నివాళులర్పించారు.
![మిత్రుడి కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ పరామర్శ జీహెచ్ఎంసీ మేయర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7696858-33-7696858-1592652706879.jpg)
జీహెచ్ఎంసీ మేయర్
తన బాల్య స్నేహితుడు ఆకస్మికంగా మృతిచెందడం బాధాకరమని మేయర్ రామ్మోహన్ అన్నారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. అతని కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:యుద్ధ వ్యూహాలతో శత్రు దేశాలను ఎదుర్కొందాం : సీఎం కేసీఆర్