తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ విత్తనాలు ఇచ్చారంటూ రైతుల ఆందోళన - Farmers are concerned about Shopkeepers giving fake seeds

మహబూబాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించడం వల్ల వరినారు పెరగడం లేదని, నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బాధిత రైతులు స్థానిక ఆగ్రోస్​ రైతు సేవా కేంద్రం ఎదుట ఆందోళన చేశారు. నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్​ చేశారు.

Farmers are concerned about Shopkeepers giving fake seeds at Danthalapalli in Mahabubabad district
నకిలీ విత్తనాలు ఇచ్చారంటూ రైతుల ఆందోళన

By

Published : Jun 22, 2020, 12:33 AM IST

మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నపల్లి, రేపోని గ్రామాలకు చెందిన పలువురు రైతులు బీపీటీ రకానికి చెందిన వరి విత్తనాలు 30 కిలోల బస్తా రూ.775 చొప్పున కొనుగోలు చేసి ఇటీవల నాటు వేశారు. రోజులు గడిచినా నారు పెరగకపోవటంతో పాటు వచ్చిన కొద్ది పాటి నారు కుళ్లిపోయిందని రైతులు ఆరోపించారు.

తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. పోలీసులు దుకాణం వద్దకు చేరుకొని రైతులతో మాట్లాడారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details