తెలంగాణ రాష్ట్రంలో నకిలీ విత్తనాలు.. పురుగులమందును విక్రయించి రైతులను మోసం చేస్తున్న వ్యాపారులపై పీడీ యాక్ట్ను నమోదు చేశారు. రాష్ట్రంలో నకిలీ ముఠాలు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ. 50 లక్షల విలువైన నకిలీ పత్తి, మిరప, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు ఉంచిన డీసీఎం వాహనం, ప్యాకింగ్ సామగ్రిని మహబూబాబాద్ పట్టణ పోలీసులు పట్టుకున్నారు.
రూ.50 లక్షల విలువైన నకిలీ విత్తనాల పట్టివేత - fake seeds and fertilizers caught at mahabubabad
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఇంట్లో విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన రూ.50 లక్షల విలువైన నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. వాటిని ఏర్పాటు చేసిన ముఠాలోని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా.. మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు సీపీ వెల్లడించారు.
![రూ.50 లక్షల విలువైన నకిలీ విత్తనాల పట్టివేత fake seeds and fertilizers caught at mahabubabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7783693-597-7783693-1593179922331.jpg)
రూ. 50 లక్షలు విలువైన నకిలీ విత్తనాల పట్టివేత
మహబూబాబాద్లోని కేంద్రంలో ఓ ఇంట్లో వీటిని స్వాధీనం చేసుకుని ముఠాలోని నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు తెలిపారు.