తెలంగాణ

telangana

ఎన్​కౌంటర్​ ఎఫెక్ట్:​  పోలీసుల విస్తృత తనిఖీలు

By

Published : Sep 6, 2020, 6:54 AM IST

ఇటీవల గుండాల అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​ నేపథ్యంలో మహబూబాబాద్​ జిల్లా పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Encounter Effect: Extensive police inspections across the district
ఎన్​కౌంటర్​ ఎఫెక్ట్:​ జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

గుండాల అటవీ ప్రాంతంలో ఇటీవల పోలీసులు, మావోలకు మధ్య జరిగిన ఎన్​కౌంటర్​లో మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు మరణించాడు. ఈ చర్యకు ప్రతీకారంగా మావోలు విధ్వంసానికి దిగే అవకాశం ఉండటం వల్ల మహబూబాబాద్ ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఏజెన్సీ మండలాలైన గంగారం, కొత్తగూడ, బయ్యారం మండలాల్లో ఇంటింటినీ జల్లెడ పడుతున్నారు. వాహనాలను తనిఖీ చేస్తూ.. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను క్షుణ్నంగా అడిగి తెలుసుకుంటున్నారు.

ఎన్​కౌంటర్​ ఎఫెక్ట్:​ జిల్లా వ్యాప్తంగా పోలీసుల విస్తృత తనిఖీలు

ఇదీచూడండి..హలో..కేసీఆర్​ను మాట్లాడుతున్నా.. పంచాయతీ కార్యదర్శికి సీఎం ఫోన్

ABOUT THE AUTHOR

...view details