తెలంగాణ

telangana

జర్నలిస్టులకు మాస్క్​లు, శానిటైజర్లు పంపిణీ

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్​లో జర్నలిస్టులకు మాస్క్​లు, శానిటైజర్లు జిల్లా కలెక్టర్​ పంపిణీ చేశారు. కరోనా సమయంలో విధి నిర్వహణలో వారు ఇబ్బంది పడకుండా అందజేశామన్నారు.

By

Published : Apr 9, 2020, 6:23 AM IST

Published : Apr 9, 2020, 6:23 AM IST

Distribution of masks and sanitizers to journalists in mahabubabad
జర్నలిస్టులకు మాస్క్​లు, శానిటైజర్లు పంపిణీ

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్​లో జర్నలిస్టులకు మాస్క్​లు, శానిటైజర్లను అందజేశారు. జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, పౌర సంబంధాల శాఖ అధికారి శ్రీనివాసరావు అందజేశారు. జిల్లాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కోవిడ్-19 సమయంలో రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారన్నారని కలెక్టర్​ అన్నారు.

ఎప్పటికప్పుడూ వాస్తవ పరిస్థితులను ప్రజలు ఆందోళన చెందకుండా తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారు ఇబ్బంది పడకుండా వీటిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

ఇదీ చూడండి :సరిహద్దులో ఓ వ్యక్తిని చంపేసిన మావోలు

ABOUT THE AUTHOR

...view details