ధరణి స్లాట్ ప్రక్రియ ద్వారా భూమిపై హక్కు లభిస్తుందని, భద్రతతో పాటు విక్రయించుకునేందుకు అర్హులు అవుతారని మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా హంకీ... భర్త బుంగ మృతి చెందడం వల్ల అతని పేరు మీద ఉన్న ఆస్తిని భార్య పేరుపై మార్పు చేసేందుకు ధరణి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకున్నారు.
మొదటి ధరణి స్లాట్ బుకింగ్... రశీదు అందజేసిన కలెక్టర్ గౌతమ్ - మహబూబాబాద్లో ధరణి స్లాట్ బుకింగ్
భూ క్రయవిక్రయాలు, పంపకాలు, ఆస్తుల వివరాలు మార్చుకునేందుకు ధరణి పోర్టల్ను వినియోగించుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ సూచించారు. మొదటగా స్లాట్బుక్ చేసుకున్న వారికి రశీదును స్వయంగా అందజేశారు.

మొదటి ధరణి స్లాట్ బుకింగ్... రశీదు అందజేసిన కలెక్టర్ గౌతమ్
మొట్టమొదటి బుకింగ్ స్లాట్ రశీదును కలెక్టర్ గౌతమ్ స్వయంగా సదరు దరఖాస్తుదారురాలికి అందజేశారు.
ప్రతి ఒక్కరూ ధరణి పోర్టల్ ద్వారా తమ ఆస్తులు వివరాలను స్లాట్లలో నమోదు చేసుకోవచ్చని, కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్లు మీసేవ కేంద్రానికి వెళ్లి స్లాట్ బుక్ చేసుకోవచ్చని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రంజిత్ కుమార్, ఆర్ఐ ప్రవీణ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి:భూముల రిజిస్ట్రేషన్కు స్లాట్ల బుకింగ్ విధానం ప్రారంభం