తెలంగాణ

telangana

By

Published : Oct 23, 2020, 12:25 PM IST

Updated : Oct 23, 2020, 1:06 PM IST

ETV Bharat / state

'వాళ్లనైనా చంపండి.. లేదంటే మేమైనా చస్తాం'

మహబూబాబాద్ జిల్లా శనిగపురంలో హత్యకు గురైన దీక్షిత్‌రెడ్డి కుటుంబం శోకసంద్రంలో మునిగింది. కిడ్నాప్‌కు గురైన బిడ్డ తిరిగొస్తాడని ఎదురుచూసిన తల్లిదండ్రులు.... ఇక తిరిగిరాడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

deekshith reddy family
'వాళ్లనైనా చంపండి.. లేదంటే మేమైనా చస్తాం'

దీక్షిత్‌ హత్యకు గురయ్యాడన్న వార్తతో కుటుంబసభ్యులు తల్లిడిల్లిపోతున్నారు. ఇంటి దీపం ఆరిపోయిందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డ జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటూ గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదిస్తున్నారు. బిడ్డ కోసం ఎన్నో కలలు గన్న అని దీక్షిత్​ తల్లి వసంత చెబుతోంది. ఇక తిరిగిరాడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అంటోంది. తన కుమారుడిని హత్యచేసిన కిరాతకుడిని వదిలిపెట్టవద్దని కోరింది.

తన మనవడి హత్య వెనుక మంద సాగర్​, మనోజ్​, సంఘర్ష్​, అనిల్​ అనే నలుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. డబ్బు కోసమే హత్య చేశారని అన్నారు. వాళ్లనైనా... చంపండి.. లేదంటే మేమైనా చస్తామంటూ... దీక్షిత్​ తాతా వాపోయారు. నిందితులను ఎన్​కౌంటర్​ చేయాలని డిమాండ్​ చేశారు.

'వాళ్లనైనా చంపండి.. లేదంటే మేమైనా చస్తాం'

సంబంధిత కథనాలు...

  1. జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!
  2. తండ్రి స్నేహితులే కిడ్నాప్‌ చేశారా?
  3. 24 గంటలు దాటినా లభించని బాలుడి ఆచూకీ
  4. మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య
  5. కిడ్నాప్ చేసిన గంటకే బాలుడి హత్య: ఎస్పీ కోటిరెడ్డి
  6. బాలుడి కిడ్నాప్ దృశ్యాలు.. ఇదిగో లైవ్ వీడియో..
Last Updated : Oct 23, 2020, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details