తెలంగాణ

telangana

By

Published : Aug 3, 2020, 9:42 PM IST

ETV Bharat / state

'చెట్లకు రాఖీ: మొక్కల రక్షణ.. భవిష్యత్​ తరాలకు భరోసా'

దేశ మంతా సోదరీమణులు.. సోదరులకు రాఖీలు కట్టి రాఖీ పండుగను సంతోషంగా జరుపుకుంటుంటే ఓ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మాత్రం చెట్లకు రాఖీలు కట్టి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Daida Venkanna founder of a public charity tied Rakhi to trees in mahabubabad and celebrated the Rakhi festival
'చెట్లకు రాఖీ: మొక్కల రక్షణ.. భవిష్యత్​ తరాలకు భరోసా'

మహబూబాబాద్ పట్టణం ఇందిరానగర్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉన్న చెట్లకు ప్రజా హృదయం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు దైద వెంకన్న రాఖీ కట్టారు. చెట్లను రంగు తీగలు, కుంకుమ... పసుపుతో అలంకరించారు. చెట్టను మనం సంరక్షిస్తే అవి మన సోదరులలాగా వచ్చే తరాలకు సైతం రక్షణను కల్పిస్తాయని వెంకన్న వెల్లడించారు.

గత 6 సంవత్సరాలుగా చెట్లను నాటుతూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటి... వాటిని సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని... రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి వార్డు కౌన్సిలర్ మర్నేని. వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీ వాసులతో కలిసి కౌన్సిలర్ చెట్లకు రాఖీలు కట్టారు. చెట్లకు కూడా రాఖీ కట్టడం మంచి కార్యక్రమమని కౌన్సిలర్​ వెంకన్న అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి :పీఎస్​కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details