మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో కొవిడ్ 19 కంట్రోల్ రూమ్ను జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డిలు ప్రారంభించారు. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారు సుమారు 100 మంది ఉన్నారని ఆయన తెలిపారు. వారు 14 రోజులపాటు గృహ క్వారంటైన్లోనే ఉండాలని, బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి వచ్చిన వారు బయటకు వస్తే.. స్థానికులు అధికారులకు తెలియజేయాలని, కరోనా లక్షణాలు కనపడినా.. కంట్రోల్రూమ్కు సమాచారం అందించాలని జిల్లా పాలనాధికారి కోరారు.
కలెక్టరేట్లో కొవిడ్19 కంట్రోల్రూమ్ ఏర్పాటు - జిల్లా పాలనాధికారి గౌతమ్
కరోనా నివారణ చర్యల్లో భాగంగా మహబూబాద్ జిల్లా కలెక్టరేట్లో కొవిడ్ 19 కంట్రోల్ రూమ్ను జిల్లా పాలనాధికారి గౌతమ్ ప్రారంభించారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్బంధంలో ఉండకుండా బయట తిరిగినా.. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపించినా స్థానికులు వెంటనే కంట్రోల్ రూమ్కు తెలియజేయాలని ఆయన సూచించారు.
![కలెక్టరేట్లో కొవిడ్19 కంట్రోల్రూమ్ ఏర్పాటు covid-19 control room inauguration by mahabubabad collector goutham](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6523273-148-6523273-1585024369684.jpg)
కలెక్టరేట్లో కొవిడ్19 కంట్రోల్రూమ్ ఏర్పాటు
జనతా కర్ఫ్యూను జిల్లా ప్రజలు విజయవంతం చేశారని, అదే విధంగా ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే తెరచి ఉంటాయని, అనంతరం మూసివేస్తారని ఆయన వెల్లడించారు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అన్ని దుకాణాలు మూసివేయాలని, ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో కొవిడ్19 కంట్రోల్రూమ్ ఏర్పాటు
ఇదీ చూడండి:దేశవ్యాప్తంగా లాక్డౌన్... కరోనా కేసులు@471