మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటి గూడెం శివారులోని కాటన్ మిల్లులో ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మద్దతు ధరను పొందేందుకు వివిధ మండలాల నుంచి రైతులు కొనుగోలు కేంద్రానికి పత్తిని తీసుకొస్తున్నారు. పత్తిని సకాలంలో కొనుగోలు చేయకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తేమ పేరుతో తీసుకువచ్చిన పత్తిని విక్రయించేందుకు అధికారులు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దళారుల రాజ్యం