తెలంగాణ

telangana

By

Published : Jul 30, 2020, 9:32 PM IST

ETV Bharat / state

'అందరికీ వరాలిస్తున్న కేసీఆర్​ సారూ.. మమ్మల్నీ పట్టించుకోండి'

తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల ముందు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వైద్య సిబ్బంది ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు డిమాండ్​ చేశారు.

contract and outsourcing medical employees protest in front of mahabubabad govt hospital
'అందరికీ వరాలిస్తున్న సీఎం కేసీఆర్​ సారూ.. మమ్మల్నీ పట్టించుకోండి'

మహబూబాబాద్​ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వైద్య సిబ్బంది ధర్నాకు దిగారు. తమను పర్మినెంట్ చేయాలని.. వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్​ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని.. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు.

తాము గత పది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ అందరికీ వరాలు ఇస్తున్నారని, అదేవిధంగా తమకూ న్యాయం చేయాలని కోరారు. ఏ నెల జీతం ఆ నెల వచ్చే విధంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి: స్నేహానికి గుర్తుగా గిఫ్ట్​ పంపించానని లక్షలు లాగేశాడు

ABOUT THE AUTHOR

...view details