దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనలకు మద్దతుగా మహబూబాబాద్ జిల్లాలో వామపక్షాలు నిరసనలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. భాజపా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళనలకు మద్దతుగా వామపక్షాల నిరసనలు - మహబూబాబాద్లో వామపక్షాల నిరసన
దిల్లీలో రైతుల ఆందోళనలకు మద్దతుగా మహబూబాబాద్ జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నెల 8న చేపట్టబోయే భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు.
![రైతుల ఆందోళనలకు మద్దతుగా వామపక్షాల నిరసనలు communists protest in mahabubabad supporting to delhi farmers agitations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9778706-164-9778706-1607185351593.jpg)
రైతుల ఆందోళనలకు మద్దతుగా వామపక్షాల నిరసనలు
కార్పొరేట్ కంపెనీలకు లాభదాయకంగా ఉన్న చట్టాలు రైతులకు తీవ్ర నష్టం చేస్తాయని సీపీఐ జిల్లా కార్యదర్శి విజయసారధి ఆవేదన వ్యక్తం చేశారు. చర్చల పేరుతో కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఈ నెల 8న దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చూడండి:రైతు దీక్ష: కొలిక్కిరాని చర్చలు- 9న మరో భేటీ