తెలంగాణ

telangana

By

Published : Jul 29, 2019, 8:16 AM IST

ETV Bharat / state

రెండోసారి వచ్చిన అమలు చేయట్లేదు

తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలైన ఇచ్చిన హామీలను అమలు చేయట్లేదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి మండిపడ్డారు. తెరాస నాయకులు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లిలో కోరారు.

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి



తెరాస ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్​ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న ప్రజలకు ఇచ్చిన వగ్దానాలు పట్టించుకోవట్లేదని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో ధ్వజమెత్తారు. హామీలు అమలు చేయని తెరాస నాయకులు గ్రామాల్లోకి వస్తే నిలదీయాలని ఆయన కోరారు.

రెండోసారి వచ్చిన అమలు చేయట్లేదు

ABOUT THE AUTHOR

...view details