తెలంగాణ

telangana

By

Published : Dec 18, 2019, 12:14 PM IST

ETV Bharat / state

'ప్లాస్టిక్​ రహిత శబరిమలగా తీర్చిదిద్దాలి'

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో అయ్యప్ప మహా పడిపూజను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే శంకర్​ నాయక్​ పాల్గొని భజనల్లో మునిగిపోయారు. శబరిమల వెళ్లే స్వాములను ప్లాస్టిక్ రహిత శబరిమలగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కోరారు.

ayyappa-padi-puja-in-mahaboobabad
'ప్లాస్టిక్​ రహిత శబరిమలగా తీర్చిదిద్దాలి'

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్​లో అయ్యప్ప మహా పడి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పడి పూజలో స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొన్నారు. మాల ధారులు, అయ్యప్ప భక్తులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పూజ కార్యక్రమాన్ని నంబూద్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. అయ్యప్ప సంకీర్తనలతో పూజ ప్రాంగణం మారుమోగింది. స్వాముల నృత్యాలు విశేషంగా అందరిని ఆకట్టుకున్నాయి. శబరిమల వెళ్లే స్వాములను ప్లాస్టిక్ రహిత శబరిమలగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే కోరారు.

'ప్లాస్టిక్​ రహిత శబరిమలగా తీర్చిదిద్దాలి'

ABOUT THE AUTHOR

...view details