మహబూబాబాద్ జిల్లా ఇంటికన్నె గ్రామానికి చెందిన చిందు యక్షగానం కళాకారులు ప్రజలకు వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. యముడు, చిత్రగుప్తుడి పాత్రలతో కేసముద్రంలోని పుర వీధుల్లో తిరుగుతూ కరోనావైరస్ బారిన పడితే చావుకు సిద్ధమైనట్లేనని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన నియమాలు విస్మరించి రోడ్ల మీద తిరుగుతున్నారని... ఎవరింట్లో వారే ఉండాలని వివరిస్తున్నారు. అధికారులు ఎంత చెప్పినా పట్టించుకోకుండా తిరుగుతున్నారని.. ఇక యమలోకానికి రావలసిందేనని అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పిస్తున్నారు.
చివరికి యముడే స్వయంగా రంగంలోకి దిగాడు.! - coronavirus latest news
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధించినా... ప్రజలు ఏమాత్రం బాధ్యత లేకుండా రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. పోలీసులు ఎంత హెచ్చరించినా... కొందరు ప్రబుద్ధులు యథేచ్ఛగా తిరగటం వల్ల... యముడే స్వయంగా రంగంలోకి దిగాడు. అధికారులు చెప్పిన మాటలు వినకపోతే.. ఇక యమలోకానికి రాక తప్పదని ఇంటింటికీ వెళ్లి చెబుతున్నాడు.

యముడే స్వయంగా రంగంలోకి దిగాడు...
ఇప్పటికైనా ఎవరింట్లో వారే ఉండి... వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. చేతులు ఎప్పటికప్పుడు కడుక్కుంటూ.. సోషల్ డిస్టేన్స్ పాటించినట్లైతే కరోనాను తరిమేయవచ్చని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కేసముద్రం ఎంపీపీ వోలం చంద్రమోహన్, సర్పంచ్ భట్టు శ్రీను తదితరులు పాల్గొన్నారు.