మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్టీసీ డిపో వద్ద విధుల్లో చేరుతామంటూ కార్మికులు భారీగా చేరుకున్నారు. విధుల్లో చేరుతున్నట్లు డిపో మేనేజర్కి వినతి పత్రాలు అందజేస్తామన్న అనుమతి లేదంటూ పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు 52 రోజులుగా సమ్మె చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని... చివరకి సమ్మె విరమించి విధుల్లో చేరేందుకు వస్తే ఆరెస్ట్ చేయడం బాగాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన కార్మికుల అరెస్ట్
మహబూబాబాద్ జిల్లాలో 52 రోజులు ఆర్టీసీ సమ్మె కొనసాగించిన కార్మికులు సమ్మె విరమించుకుని విధుల్లోకి చేరేందుకు వస్తున్న ప్రభుత్వం చేర్చుకోవట్లేదు. కార్మికులను అరెస్టు చేస్తున్నారు పోలీసులు.
వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన కార్మికుల అరెస్ట్