మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీలో మంగళవారం సాయంత్రం మున్సిపాలిటీ సిబ్బంది జేసీబీతో భూమిని చదును చేయిస్తున్నారు. ఇంతలో ఓ చోట పురాతన నంది, ఆంజనేయ స్వామి విగ్రహాలు బయటపడ్డాయి.
తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహాలు - etv bharath
అభివృద్ధి పనుల కోసం భూమిని చదును చేస్తుంటే పురాతన విగ్రహాలు బయటపడిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీలో జరిగింది. కాలనీ వాసులంతా ఆ విగ్రహాలను ఓ చోట ప్రతిష్ఠించి జలాభిషేకం చేశారు.
![తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహాలు Ancient statues find at gopalapuram village in mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8903544-thumbnail-3x2-staus.jpg)
తవ్వకాల్లో బయటపడ్డ పురాతన విగ్రహాలు
కాలనీ వాసులంతా ఆ విగ్రహాలను ఓ చోట ప్రతిష్ఠించారు. జలాభిషేకం చేసి... భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పురాతన కాలంలో అవి బయటపడిన చోట దేవాలయాలు ఉండేవని తమ పూర్వీకులు చెప్పారని స్థానికులు తెలిపారు. ప్రభుత్వం సహాయ సహకారాలతో ఇక్కడ గుడి నిర్మించేందుకు కాలనీ వాసులంతా కృషి చేస్తామన్నారు.