లాక్డౌన్ సమయంలో వచ్చిన అధిక విద్యుత్ బిల్లులను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేతలు జిల్లా మహబూబాబాద్ కేంద్రంలో ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'పేదల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి' - latest news of mahabubabad
లాక్డౌన్ కాలంలోని పేదల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలంటూ కాంగ్రెస్ నాయకులు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేశారు.
!['పేదల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి' against the heavy current bills congress leaders protest at mahabubabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7914464-749-7914464-1594040327024.jpg)
'పేదల విద్యుత్ బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి'
పేదల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో ఏ విధమైన పనులు దొరక్క.. పూట గడవక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం రెండు నెలల పాటు పదిహేను వందల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్