తెలంగాణ

telangana

ETV Bharat / state

తేలు కాటుతో విద్యార్థి మృతి - తేటు కాటుతో విద్యార్థి మృతి

తేలుకాటుతో పదో తరగతి విద్యార్థి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజాపురంలో చోటు చేసుకుంది.

తేటు కాటుతో విద్యార్థి మృతి

By

Published : Nov 7, 2019, 8:44 PM IST

మహబూబాబాద్​ జిల్లా దంతాలపల్లి మండలం రామానుజాపురంలో విషాదం జరిగింది. తేలు కాటుతో పదిహేనేళ్ల బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన మల్లం నవీన్‌ దంతాలపల్లిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. మంగళవారం రాత్రి సమయంలో ఇంటి వద్ద తేలు కరిచించి. తీవ్ర అస్వస్థతకు గురైన బాలుడిని తొర్రూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడం వల్ల అక్కడి నుంచి హైదరాబాద్​కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బాలుడి మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది.

తేటు కాటుతో విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details