మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం శివారు బస్తారాం తండాకు చెందిన సురేశ్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో పశువులను మేపుతున్నారు. ఈ క్రమంలో పది అడుగుల పొడవైన భారీ కొండచిలువ ఓ ఎద్దు కాలును చుట్టేసింది. దీంతో పశువులు ఒక్కసారిగా పరుగుతీశాయి. గుర్తించిన రైతు కర్రతో కొట్టి దాన్ని హతమార్చాడు. ఇంత పెద్ద కొండచిలువను తామెప్పుడు చూడలేదని తండావాసులు అన్నారు.
ఎద్దును చుట్టేసిన భారీ కొండచిలువ.. చంపేసిన రైతు - man kills massive python
మహబూబాబాద్ జిల్లా పడమటిగూడెం శివారు బస్తారాం తండాలో భారీ కొండచిలువ హతమైంది. ఎద్దు కాలును చుట్టేయడం వల్ల రైతు దానిని గుర్తించి వెంటనే చంపేశాడు.
![ఎద్దును చుట్టేసిన భారీ కొండచిలువ.. చంపేసిన రైతు a python killed by man in mahabubabad district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8617695-130-8617695-1598800339980.jpg)
భారీ కొండచిలువ మహబూబాబాద్ జిల్లా భారీ కొండచిలువ.. హతమార్చిన రైతుహతం