తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులను సన్మానించిన జాగృతి మహిళా మండలి సభ్యులు - corona virus

లాక్​డౌన్​ నేపథ్యంలో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులను కాగజ్​నగర్​లో జాగృతి మహిళా మండలి సభ్యులు సత్కరించారు. పోలీసులు నిబద్ధతతో విధులు నిర్వహించడం వల్లే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలుగుతున్నామని జాగృతి సభ్యులు అన్నారు.

women honoring police in kumurambheem asifabad district
పోలీసులను సన్మానించిన జాగృతి మహిళా మండలి సభ్యులు

By

Published : May 12, 2020, 4:10 PM IST

కరోనా కష్టకాలంలో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై పూలు చల్లి శాలువతో సత్కరించారు కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ పట్టణంలోని జాగృతి మహిళా మండలి సభ్యులు. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఎస్సైలు రవి కుమార్, రాజ్ కుమార్, తహశీయుద్దీన్​తో పాటు ఇతర పోలీస్ సిబ్బందికి శాలువా కప్పి సన్మానించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు లాక్​డౌన్ విధించగా పోలీసులు నిబద్ధతగా విధులు నిర్వహించడం వల్లే వైరస్ వ్యాప్తి నియంత్రించగలుగుతున్నామని జాగృతి సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి మహిళా మండలి అధ్యక్షురాలు గీతా చౌహన్, కార్యదర్శి నీతూ సర్కార్, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ప్రజల ముందుకు నిజాన్ని తీసుకొచ్చిన ఈనాడుకు అభినందనలు

ABOUT THE AUTHOR

...view details