తెలంగాణ

telangana

ETV Bharat / state

'పోడు భూముల సమస్యల పరిష్కారానికి కృషి'

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నూతన జడ్పీ ఛైర్​ పర్సన్​గా కోవ లక్ష్మి ప్రమాణం చేశారు. గిరిజనులు ఎదుర్కొంటున్న విద్య, వైద్య రంగాల్లోని సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

By

Published : Jul 5, 2019, 11:46 PM IST

ఆసిఫాబాద్ జిల్లా నూతన జడ్పీ ఛైర్​ పర్సన్​గా కోవ లక్ష్మి ప్రమాణం

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తొలి జడ్పీ ఛైర్మన్​గా కోవ లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. గిరిజన సమస్యలను తీర్చడానికి శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు.
పోడు భూములకు సంబంధించిన అంశాలను పరిష్కరించడానికి తన వంతు పాత్ర పోషిస్తానని వివరించారు. కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించగా ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తదితరులు పాల్గొన్నారు.

గిరిజన సమస్యలను తీర్చడానికి శాయశక్తుల కృషి

ABOUT THE AUTHOR

...view details