తెలంగాణ

telangana

ETV Bharat / state

నిధిగా భావిద్దాం విధిగా ఓటేద్దాం

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్​లో ఈటీవీ-ఈనాడు ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఓటు హక్కు వినియోగంపై  అవగాహన కల్పించారు.

By

Published : Apr 8, 2019, 7:03 PM IST

ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం

ప్రజా సమస్యలే పరమావధిగా.. జనజాగృతం చేసే కార్యక్రమాలకు చిరునామాగా నిలిచే ఈనాడు ఈటీవీ... ఓటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈనాడు మీతోడు పేరుతో కుమరం భీం జిల్లా కాగజ్​నగర్​లో ఓటు ఆవశ్యకత కార్యక్రమం నిర్వహించారు.

అంతా విధిగా ఓటేయ్యాలి

స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డ్వాక్రా గ్రూపు మహిళలు పాల్గొన్నారు. పారదర్శకంగా ఓటేస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుందని వ్యక్తలు అభిప్రాయబడ్డారు. ఈ ఎన్నికల్లో అంతా విధిగా ఓటేసి సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవాలని వివరించారు. ముఖ్యంగా విద్యావంతులు విధిగా ఓటేసి మిగతా వారిని ప్రోత్సహించాలని సూచించారు.

ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం

ఇదీ చదవండి: ఎన్నికల్లో డబ్బు, మద్యమే కాదు...మిక్సీలు కూడా!

ABOUT THE AUTHOR

...view details