తెలంగాణ

telangana

స్వాతంత్య్ర దినోత్సవ సభలో సర్పంచ్​ని నిలదీసిన గ్రామస్థులు

By

Published : Aug 15, 2020, 5:57 PM IST

గ్రామ పంచాయితీ నిధులు సరిగ్గా నిర్వహించడం లేదంటూ.. గ్రామస్థులు, వార్డు సభ్యులు సర్పంచ్​ని నిలదీసిన ఘటన కొమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా ఆసిఫాబాద్​ మండల పరిధిలోని ఈదులవాడ గ్రామ పంచాయితీలో చోటు చేసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవ సభా కార్యక్రమంలోనే నిధుల వినియోగంపై సర్పంచ్​ను ప్రశ్నించారు.

Villagers Protest In Front Of Panchayath Office In Edulaguda In Asifabad
స్వాతంత్య్ర దినోత్సవ సభలో సర్పంచ్​ని నిలదీసిన గ్రామస్థులు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని ఈదులవాడ గ్రామపంచాయతీ సర్పంచ్​ను ఈదులవాడ గ్రామపంచాయతీ పరిధిలోని తెనుగుగూడ గ్రామస్థులు నిలదీశారు. పంచాయతీ నిధుల వినియోగంపై వివరణ ఇవ్వాలని తెనుగుగూడ వార్డు సభ్యుడు వెంకటేశ్వర్లు.. ఈదులవాడ సర్పంచ్ భీమేష్​ను నిధుల ఖర్చు గురించి వివరాలు అడిగారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం నిర్వహించిన గ్రామసభలో సర్పంచ్​ భీమేష్​ను గ్రామపంచాయతీ నిధులను అభివృద్ధి పనులకు ఎందుకు వినియోగించడం లేదని నిలదీశారు.

అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు తెనుగు గూడ గ్రామ ప్రజలు నిరసన తెలిపారు. అధికారులు గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. నిధుల వివరాలను పూర్తిగా వివరించాల్సిన బాధ్యత సర్పంచ్​పై ఉన్నదని, నిధుల వినియోగం గురించి ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకపోవడం సరికాదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్​గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. నిధుల వినియోగం గురించి పూర్తి వివరాలు ప్రజలకు తెలిపి, గ్రామంలోని పలు సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు.

ఇవీ చూడండి:ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు

ABOUT THE AUTHOR

...view details