కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని ఈస్గం శివమల్లన్న స్వామిని ఆదివాసీలు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈస్గం శివమల్లన్నకు ఆదివాసీల ప్రత్యేక పూజలు - నాగోబా జాతర వార్తలు
కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలోని ఈస్గం శివమల్లన్నను ఆదివాసీలు దర్శించుకున్నారు. నాగోబా జాతరకు ముందు.. ఏటా స్వామిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ అని చెప్పారు.
ఈస్గం శివమల్లన్నకు ఆదివాసీల ప్రత్యేక పూజలు
ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు మహారాష్ట్రలోని ఆదివాసీలు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ ఛైర్మన్ ఘనస్వాగతం పలికారు. సంప్రదాయ డోలు, వాద్యాల నడుమ ఆదివాసీ పెద్దలు శివమల్లన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వనభోజనాలు చేశారు. నాగోబా జాతరకు ముందు ఏటా శివమల్లన్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోందని ఆదివాసీ పెద్దలు తెలిపారు.