తుమ్మిడి హెట్టి వ్యయం, ప్రాజెక్టు పేరు మీద జరుగుతున్న అవినీతిని ప్రజలకు తెలియజెప్పేందుకే రాష్ట్ర నాయకత్వం ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడి డబ్బులు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు ముసుగులో వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీకి గురవుతోందని ఆరోపించారు. ప్రాజెక్టుపై సందర్శన అనంతరం భట్టి "ఈటీవీ భారత్"తో మాట్లాడారు.
"ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకే ప్రాజెక్టుల సందర్శన" - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. తక్కువ ఖర్చుతో నిర్మితమయ్యే ప్రాజెక్టులను రీడిజైన్ చేసి భారీ ఖర్చుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.

ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు : భట్టి
ప్రాజెక్టుల రీడిజైన్ పేరిట ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు : భట్టి
ఇవీ చూడండి : తుమ్మిడిహట్టిలో "కేసీఆర్" తట్టెడు మట్టి ఎత్తలేదు
Last Updated : Aug 27, 2019, 8:27 AM IST