కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మున్సిపాలిటీలో నామపత్రాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు 5 నామపత్రాలు దాఖలయ్యాయి. తెరాస అభ్యర్థులు... 21వ వార్డు నుంచి రాచకొండ గిరీశ్, 14 వ వార్డు నుంచి నసీమ భాను,17 వ వార్డు నుంచి విజయ్ యాదవ్ నామ పత్రాలు దాఖలు చేశారు.
కాగజ్నగర్లో కొనసాగుతున్న నామినేషన్ల పరంపర - కాగజ్నగర్ మున్సిపల్ ఎలక్షన్స్ 2020
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పురపాలికలో నామినేషన్ల పరంపర కొనసాగుతోంది. నామపత్రాల స్వీకరణ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు పర్యవేక్షించారు.

కాగజ్నగర్లో కొనసాగుతున్న నామినేషన్ల పరంపర
కాగజ్నగర్లో కొనసాగుతున్న నామినేషన్ల పరంపర
కాంగ్రెస్ పార్టీ నుంచి 16వ వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థి కచ్చకాయల జ్యోతి, 26 వ వార్డు నుంచి వసీమున్నిసా నామినేషన్ వేశారు. పార్టీల తరఫున నామపత్రాలు దాఖలు చేసినప్పటికీ అభ్యర్థులెవరూ బీ ఫారమ్ జతపరచలేదని అధికారులు తెలిపారు.
- ఇదీ చదవండిః ఓట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పుర ఎన్నికల మేనిఫెస్టో