తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్సు డ్రైవర్​కు మూర్ఛ.. తప్పిన పెను ప్రమాదం - కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా ఇంద్రానగర్​ జాతీయ రహదారి

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా ఇంద్రానగర్​ జాతీయ రహదారిపై 50 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న విశ్రాంత డ్రైవర్​ చాకచక్యంతో బస్సును అదుపులోకి తీసుకొచ్చాడు.

బస్సు డ్రైవర్​కు మూర్ఛ.. తప్పిన పెను ప్రమాదం

By

Published : Nov 6, 2019, 7:59 PM IST

బస్సు డ్రైవర్​కు మూర్ఛ.. తప్పిన పెను ప్రమాదం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇంద్రానగర్ జాతీయ రహదారిపై కాగజ్ నగర్​ వెళ్తున్న మంచిర్యాల డిపో బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ గణేశ్​​కు మూర్ఛ రావడం వల్ల అందులో ప్రయాణిస్తున్న విశ్రాంత డ్రైవర్ యూసఫ్ బస్సును చాకచక్యంగా అదుపు చేశారు. బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది.

రెబ్బెన మండలం గోలేటి లో ఒక వివాహానికి వెళ్తున్న జిల్లా జడ్పీ ఛైర్​పర్సన్​ కోవా లక్ష్మి ఈ సంఘటనను గమనించారు. బస్సు డ్రైవర్​ గణేశ్​ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రిటైర్డ్ డ్రైవర్​ యూసఫ్​తో బస్సులోని ప్రయాణికులను కాగజ్ నగర్​కు సురక్షితంగా చేరవేశారు.

ABOUT THE AUTHOR

...view details