తెలంగాణ

telangana

ETV Bharat / state

కుమురంభీం జిల్లాలో కొనసాగిన అరెస్టుల పర్వం

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలీసులు పలు సంఘాల నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.

By

Published : Oct 19, 2019, 7:38 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా పలు సంఘాల నాయకులు బంద్​లో పాల్గొన్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్​ పాటిస్తున్నాయి. వామపక్ష సంఘాలతో పాటు విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. ఉదయం నుంచి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు సంఘాల నాయకులను, ఆర్టీసీ కార్మికులను 67 మందిని అరెస్టు చేసి జిల్లాలోని వివిధ పోలీస్​ స్టేషన్లకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details