తెలంగాణ

telangana

రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు

By

Published : Feb 11, 2019, 9:53 PM IST

తరగతులు ముగించుకొని ఇంటికి తిరుగు ప్రయాణమైన విద్యార్థులను లారీ ఢీకొనడంతో వారు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థులు

రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమం
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రహదారిపై ద్విచక్రవాహనంలో వెళ్తున్న నలుగురు విద్యార్థులను లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరు పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. గమనించిన స్థానికులు ఆసిఫాబాద్​ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details