రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరి పరిస్థితి విషమం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రహదారిపై ద్విచక్రవాహనంలో వెళ్తున్న నలుగురు విద్యార్థులను లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వీరు పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. గమనించిన స్థానికులు ఆసిఫాబాద్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ తెలిపారు.