తెలంగాణ

telangana

By

Published : Oct 1, 2019, 3:22 PM IST

Updated : Oct 2, 2019, 7:28 AM IST

ETV Bharat / state

'ప్లాస్టిక్ నిషేధం మన ఇంటి నుంచే మొదలవ్వాలి'

కాగజ్​ నగర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు.

'ప్లాస్టిక్ నిషేధం మన ఇంటి నుంచే మొదలవ్వాలి'

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​ నగర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ప్లాస్టిక్​ నిషేదంపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వనజా రెడ్డి, కమిషనర్ భట్టు తిరుపతి, కాగజ్ నగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా మన నిత్యావసరాల దృష్ట్యా వాడుతున్న ప్లాస్టిక్ రాబోయే తరానికి పెను ముప్పుగా మారుతుందని అన్నారు. ప్లాస్టిక్ నిషేధం అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలని.. మనం ఆచరించినప్పుడే ఎదుటివారికి చెప్పగలమని సూచించారు.

'ప్లాస్టిక్ నిషేధం మన ఇంటి నుంచే మొదలవ్వాలి'
Last Updated : Oct 2, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details