తెలంగాణ

telangana

ETV Bharat / state

రెబ్బెనలో నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ సోయం - ఎంపీ సోయం బాబూరావు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటన

రెబ్బెన మండలంలోని పలు గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేశారు ఎంపీ సోయం బాబూరావు. కరోనా నేపథ్యంలో జిల్లాలో పర్యటిస్తూ... ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

mp-soyam-baburao-distributed-food-items-at-rebbena-mandal-kumaram-bheem-asifabad-district
రెబ్బెనలో నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎంపీ సోయం

By

Published : Apr 27, 2020, 12:54 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపీ సోయం బాబూరావు పర్యటించారు. రెబ్బెన మండలం రోళ్లపాడు, కొత్తగూడ గ్రామాల్లో నిరుపేదలకు నిత్యావసర సరకులు అందజేశారు. ప్రస్తుతం కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే సరైన మార్గామని... అందరూ సమష్టిగా కృషి చేయాలని అన్నారు. కరోనా వైరస్‌ నివారణకు ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. లాక్‌డౌన్‌తో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారిని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details