తెలంగాణ

telangana

ETV Bharat / state

నిత్యాన్నదాన షెడ్డు కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కోనేరు కోనప్ప - కాగజ్ నగర్ లేటెస్ట్ న్యూస్

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్​ పట్టణంలో నిత్యాన్నదాన కార్యక్రమం షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు భూమి పూజ నిర్వహించారు. పేదలకు ఒక్కపూటైనా భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. త్వరలోనే అన్ని సదుపాయాలతో పునఃప్రారంభం అవుతుందని వెల్లడించారు.

mla koner konappa bhoomi puja in kagaznagar kumaram bheem district
'పేదలకు ఒక్కపూటైనా భోజనం పెట్టాలనే సంకల్పంతోనే నిత్యాన్నదాన కార్యక్రమం'

By

Published : Oct 24, 2020, 12:34 PM IST

సిర్పూర్ నియోజకవర్గంలోని పేదలకు కనీసం ఒక్కపూటైన భోజనం పెట్టాలనే దృఢ సంకల్పంతో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించినట్లు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే నిత్యాన్నదానం షెడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, రమాదేవి దంపతులు భూమి పూజ చేశారు. కొవిడ్ వల్ల ఈ కార్యక్రమం కొద్దిరోజులు వాయిదా పడిందని... త్వరలోనే పునఃప్రారంభం చేయనున్నామని పేర్కొన్నారు.

అన్ని సదుపాయాలతో...

స్థలం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా కేటాయించినట్లు ఎమ్మెల్యే కోనప్ప తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలనే షెడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. కాగజ్ నగర్ పట్టణానికి నియోజకవర్గంలోని ప్రజలు నిత్యం వేలాది మంది వస్తుంటారని... వారు ప్రశాంత వాతావరణంలో భోజనం చేసేలా సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనప్ప సోదరుడు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణారావు, కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ కోనేరు వంశీ, వారి కుటుంబ సభ్యులు, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:దారుణం: తల్లిని చంపాడు.. తల, మొండెం వేరుచేశాడు

ABOUT THE AUTHOR

...view details