తెలంగాణ

telangana

ETV Bharat / state

మిషన్​ భగీరథ పైప్​లైన్ లీక్... వృథాగా పోతున్న నీరు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జనకపూర్​లో ప్రజలు తాగడానికి నీరు లేక అల్లాడుతుంటే.. మిషన్​ భగీరథ పైప్​లైన్ లీకై నీరు వృథాగా పోతోంది.

By

Published : Sep 17, 2019, 9:37 PM IST

వృథాగా పోతున్న నీరు

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జనకపూర్​లోని జిల్లా పాలనాధికారి కార్యాలయానికి సమీపంలో మిషన్ భగీరథ పైప్​లైన్ లీకై నీరు వృథా పోతోంది. తాగడానికి నీరు లేక అల్లాడుతుంటే.. ఇలా నీరు వృథాగా పోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయమని ఇదివరకే మిషన్ భగీరథ సిబ్బందికి చెప్పినా... పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే బాగు చేయాలని కోరుతున్నారు.

వృథాగా పోతున్న నీరు

ABOUT THE AUTHOR

...view details