తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2022, 5:11 PM IST

ETV Bharat / state

Harish rao in Asifabad: మారుమూల ప్రాంతాల్లోనూ ఆధునాతన వైద్యసేవలు: హరీశ్ రావు

Harish rao in Asifabad: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అంకుసపూర్ గ్రామంలో నూతన జిల్లా ఆస్పత్రి, రేడియాలజీ ల్యాబ్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో వేదమంత్రాలతో మంత్రికి స్వాగతం పలికారు.

Harish rao
వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు

Harish rao in Asifabad: ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. జిల్లాలో రూ.60 కోట్లతో 340 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలోని అంకుసపూర్​​లో 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో నూతన జిల్లా ఆస్పత్రి, రేడియాలజీ ల్యాబ్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. జిల్లా ప్రజాప్రతినిధులు పూర్ణకుంభంతో వేదమంత్రాలతో మంత్రికి స్వాగతం పలికారు.

ఆస్పత్రులు నిర్మించడమే కాకుండా వైద్య సిబ్బందని తగినస్థాయిలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మారుమూల గిరిజన గ్రామంలో ఏఎన్ఎం సబ్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా పాలనాధికారిని ఆదేశించారు. అసిఫాబాద్, కాగజ్​నగర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కోరిక మేరకు డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రం నుంచి మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పిస్తామన్నారు. తెలంగాణ వచ్చాక తండాలు, గూడెలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం కేసీఆర్​కే సాధ్యమైందన్నారు. ఆస్పత్రి నిర్మాణ అనంతరం వైద్య కళాశాలను ఏర్పాటు చేయడాన్ని కేసీఆర్ సుముఖంగా ఉన్నారని అన్నారు.

ఆసిఫాబాద్​ అంటేనే మారుమూల ప్రాంతం. ఇక్కడ గతంలో వైద్యం అందేది కాదు. ఇప్పుడు రూ.60 కోట్లతో 340 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశాం. ఈ డబ్బులతో ఆధునాతన ఆస్పత్రి నిర్మిస్తాం. అన్ని రకాల వైద్యం అందుబాటులోకి రానుంది. సిబ్బందిని తగినంత నియమించి వైద్య సదుపాయాలు కల్పిస్తాం. ఆసిఫాబాద్​లోనే అన్ని రకాల వ్యాధులకు వైద్యమందిస్తాం. ఎమ్మెల్యేగారు డయాలసిస్ సెంటర్ కావాలని అడిగిండ్రు. నెలరోజుల్లోనే మంజూరు చేస్తాం. కాగజ్​నగర్​లో కావాలని అడిగారు. అక్కడ కూడా మంజూరు చేసి అందుబాటులోకి తెస్తాం. జైనూర్ పీహెచ్​సీని అభివృద్ధి చేస్తాం. రోడ్లకు సంబంధించి నిధులు త్వరలోనే సీఎం కేటాయిస్తారు. సీఎం నిర్ణయంతో గూడెంలు పంచాయతీలుగా మారాయి. కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు కూడా మంజూరూ చేస్తాం.

- హరీశ్​ రావు, వైద్యారోగ్యశాఖమంత్రి

వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details