కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కళాకారుడు, పద్మశ్రీ గ్రహీత కనకరాజును అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సన్మానించారు. పూలమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు ఆదివాసీలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. మంత్రితో గుస్సాడీ నృత్యాలు చేయించారు.
ఆదివాసీ బిడ్డయిన కనకరాజును పద్మశ్రీ పురస్కారం వరించడం మనందరి అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. ఇది జిల్లాకు దక్కిన గౌరవంగా భావించాలన్నారు. కనకరాజు దీనస్థితిని చూసి.. తనకు ట్రాక్టర్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.